తమిళనాడులో మరో 75 మందికి కరోనా పాజిటివ్.. అందులో 74 మంది తబ్లిఘీ కార్యక్రమానికి వెళ్లినవారే

తమిళనాడులో మరో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. అందులో 74 మంది దిల్లీలో తబ్లిఘీ జమాత్ ఈవెంటుకు వెళ్లినవారేనని ఆ రాష్ట్ర హెల్త్ సెక్రటరీ బీలా రాజేశ్ తెలిపారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 309 కరోనా పాజిటివ్ కేసులు తేలగా అందులో 264 మంది తబ్లిఘీ జమాత్ కార్యక్రమానికి వెళ్లినవారేనని చెప్పారామె.